MI vs KKR: ఇవాళ సొంతగడ్డ వాంఖడేపై ముంబై ఆడబోతుంది.. గెలుస్తుంది అంటారా?

MI vs KKR: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఈ సీజన్లో తొలిసారిగా సొంత మైదానంలో ఆడబోతోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు పూర్తిగా సన్నద్ధమయ్యాయి. దీంతో వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ పోరు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్కు ఈ సీజన్ ఇప్పటివరకు అంతగా కలసి రాలేదు. మొదటి రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో తొలి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత, రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 36పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు వరుసగా రెండు పరాజయాల తర్వాత, ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశ్యంతో సొంత మైదానంలోకి రానుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడితే.., ఆ జట్టు సీజన్ ఓపెనర్ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయం పాలైంది. కానీ అజింక్య రహానె కెప్టెన్సీలో కేకేఆర్ జట్టు మరుసటి మ్యాచ్లోనే పునరాగమనం చేసి రాజస్థాన్ రాయల్స్ను సులభంగా ఓడించింది. మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్పై ఆ విజయ పరంపరను కొనసాగిస్తుందో లేదో చూడాలి.