ఆంధ్ర ప్రదేశ్
నకిలీ మద్యం వ్యవహారం.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు

నకిలీ మద్యం వ్యవహారంలో ములకలచెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందును సస్పెండ్ చేశారు. నకిలీ మద్యం స్థావరాన్ని గుర్తించకపోవడంతోపాటు విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకుగాను హిమబిందుపై వేటు వేశారు ఉన్నతాధికారులు విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ములకలచెరువు ఎక్సైజ్ సీఐగా లక్కిరెడ్డిపల్లిలో పనిచేస్తున్నటువంటి కిషోర్ ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.



