తెలంగాణ
MP Laxman: దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవుతుంది

MP Laxman: హైదరాబాద్ వనస్థలిపురంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. మోడీ మూడోసారి ప్రధాని కావడం వల్లే దేశం అభివృద్ధిలో పరుగులు పెడతుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కులం మతం పేరిట పబ్బం గడుపుతున్నాయని ఆయన విమర్శించారు. దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.