తెలంగాణ
MP Laxman: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్

MP Laxman: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైరయ్యారు. నిజమైన ఎమర్జెన్సీని కాంగ్రెస్ పార్టీ విధించిన విషయాన్ని మర్చిపోయి ఖర్గే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. జపాన్ను వెనక్కి నెట్టి ఆర్థికంగా భారత్ ముందుకెళ్తుందన్నారు. నాల్గొవ స్థానానికి ఇండియా చేసుకుందన్నారు. ప్రజల్లో మోడీ పట్ల పెరిగిన ఆదరణ వాళ్లకు కనిపించడం లేదన్నారు.
ఖర్గేకు వస్తున్న కలలు ప్రజలకు ఆపాదిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలన కన్నా వంద రెట్ల అభివృద్ధి మోడీ ప్రభుత్వం చేసిందన్నారు. మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఆయుధాలను వదలకుండా చర్చలు అంటే ఎలా అని అన్నారు.