ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి

Visakhapatnam: విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెందుర్తి మండలం సత్తివాని పాలెంలో ఇద్దరు పిల్లలతో ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా కొల్లి గీత అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకింది.
భర్త పవన్ మద్యం తాగి అనుమానిస్తూ కొట్టడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో బాలుడు మణికంఠ మృతి చెందగా కూతురు యోక్షిత శ్రీని స్థానికులు రక్షించారు. ఈ విషాద ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.