తెలంగాణ
గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

గొర్రెల స్కాం కేసులో.. ప్రధాన నిందితుడు, కాంట్రాక్టర్ మొయినుద్దీన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ కేసు నమోదుతో దుబాయ్ పారిపోయిన మొయినుద్దీన్ హైదరాబాద్కి తిరిగిరావడంతో ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. గొర్రెలు కొనుగోలు చేసి వాటి యజమానులకు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ డబ్బులు ఇవ్వలేదు.
అంతేకా దు 700కోట్లు నిధులు పక్కదారి పట్టాయని గుర్తించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.