సినిమా
పెదరాయుడు 30 ఏళ్ల వేడుక: మోహన్ బాబు, రజినీ సంబరాలు!

టాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘పెదరాయుడు’ చిత్రంలో మోహన్ బాబు డ్యుయల్ రోల్తో, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పాపా రాయుడు’గా మెప్పించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో సౌందర్య, భానుప్రియ కీలక పాత్రల్లో నటించారు. మోహన్ బాబు నిర్మాతగా సినిమాను రూపొందించారు.
1995లో విడుదలైన ‘పెదరాయుడు’ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్ బాబు, రజినీకాంత్ కలిసి సంబరాలు జరుపుకున్నారు. కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అవార్డులు, రికార్డు కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
కోటి సంగీతం సినిమాకు హైలైట్. ‘కన్నప్ప’ ప్రమోషన్స్లో భాగంగా రజినీతో మోహన్ బాబు ఈ విజయాన్ని గుర్తు చేసుకున్నారు. రజినీ ‘పెదరాయుడుతో పాపా రాయుడు’ అన్న కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘కన్నప్ప’ చిత్రాన్ని చూసిన రజినీ టీమ్ను అభినందించారు.