Modi: టర్కీకి తగిన రీతిలో గుణపాఠం నేర్పేందుకు మోడీ స్కెచ్

Modi: ఆపరేషన్ సిందూర్ సందర్భంలో శత్రుదేశం పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన టర్కీ గుండెల్లో గుబులు మొదలైంది. ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత ప్రధాని భారీ స్కెచ్ వేశారు. పాక్తో యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చాక మోదీ తొలిసారి చేసే విదేశీ పర్యటన టర్కీ గుబులు పుట్టిస్తుంది. ఇప్పటికే టర్కీని భారత్ కోలుకోలేని దెబ్బ తీసింది.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టర్కీకి భారతీయుల బాయ్ కాట్ నిర్ణయం పిడుగులా ఉంటే ఇప్పుడు తాజాగా మోదీ తీసుకున్న నిర్ణయంతో టర్కీ పని అయిపోనట్లే భారత్తో పెట్టుకుంటే అదే తరహాలో రిటర్న్ గిఫ్ట్ ఉంటుందనే విషయం టర్కీకి బోధ పడుతుందేమో ఇంతకీ మోదీ ఎక్కడ పర్యటించనున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం ఏంటి..? భవిష్యత్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి..?
పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ పేరుతో ఎదురు దాడి చేసింది. ఈ తరుణంలో ఒక్క టర్కీ మినహా ప్రపంచ దేశాలు భారత్ కి మద్దతు పలికాయి. కానీ ఇస్లామిక్ దేశమైన టర్కీ మాత్రం మరొక ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్కు మద్దతు ఇచ్చింది. మత పిచ్చితో మానవత్వాన్ని మరిచి ఉగ్రభూతానికి మద్దతు పలికింది.
నువ్వూ-నేనూ ఒక్కటేనంటూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. భారత్పై పాకిస్తాన్ టర్కీ డ్రోన్లతో దాడులకు తెగబడింది. దీంతో ఒక్కసారిగా భారతీయులందరూ విస్మయానికి గురయ్యారు. మనం చేసిన సాయాన్ని మరిచి మన శత్రుదేశానికి టర్కీ అండగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తాయి.
రెండేళ్ల క్రితం 2023 టర్కీలో భూకంపం అతలాకుతలం చేసింది. ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. అలాంటి సమయంలో ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్త్ అంటూ అభయమిచ్చింది మోడీ సర్కార్. 8 లక్షల 45 వేల 590 డాలర్ల విలువైన సామాగ్రిని అందజేసి రక్షణ చర్యలు చేపట్టింది. కానీ ఇస్లాం దేశమన్న అభిమానంతోనే టర్కీ పాకిస్తాన్కు క్షిపణులను, మందుగుండు సామాగ్రిని, రక్షణ సామాగ్రిని అందిస్తోంది. అయితే టర్కీ పాకిస్తాన్కు ఇచ్చిన ఆయుధాలన్నీ సీమ టపకాయలేనని తెలిపోయింది.
పొరుగున ఉన్న ముస్లిం దేశాలన్నీ పాకిస్తాన్ను గౌరవించవు, లెక్క కూడా చేయవు. అలాంటిది ఇంగితం లేకుండా వ్యవహరిస్తోంది టర్కీ. షరియా చట్టాన్ని పాటించే తాలిబన్లు సైతం పాకిస్తాన్ను కూరలో కరివేపాకు అనుకుంటుంటే టర్కీ దమననీతిని ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ చేసిన దురాగతాన్ని సైతం నిస్సిగ్గుగా సపోర్ట్ చేసిన టర్కీ విషయంలో భారత్ కఠిన వైఖరి అనుసరించాలని నిర్ణయం తీసుకుంది.
వాణిజ్య పరంగా టర్కీతో ఉన్న సంబంధాలను తెగదెంపులు తీసుకునే దిశగా భారత్ పావులు కదుపుతోంది. మరోవైపు దౌత్య పరంగానూ టర్కీతో అమీతుమీ తేల్చుకునేందుకు భారత విదేశాంగ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే భారత్లో భాయ్ కాట్ టర్కీ నడుస్తుంది.
ఇలా పాక్ కు మద్దతిచ్చిన టర్కీని అన్ని విధాలా కార్నర్ చేసేందుకు భారత్ వ్యూహ రచన చేస్తోంది. గతంలో మాదిరిగా తాము ఏమి చేసిన భారత్ పట్టించుకోదనే టర్కీ పాలకుల ఆలచనలో మార్పు రావలన్నది భారత్ లక్ష్యం.
భారత ప్రభుత్వం టర్కీని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి టర్కీ డ్రోన్లను సరఫరా చేసి, మన దేశంపై దాడులకు ఉసిగొల్పింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను వెనకేసుకు రావడమే కాకుండా ఆదేశానికి ఆయుధాలు సరఫరా చేసి, భారత్ పై దాడి చేయించిన కారణంగా టర్కీని కూడా శత్రు దేశంగా చూడాలని భారత్ నిర్ణయానికి వచ్చింది. తమ శత్రువైన పాకిస్తాన్ కు మద్దతిస్తున్న టర్కీకి అర్ధమయ్యే భాషలోనే గుణపాఠం నేర్పాలని ప్రధాని నరేంద్ర మోదీ మాస్టర్ స్కెచ్ వేశారు.
అదేమిటంటే జీ7 సమ్మిట్ కు హాజరయ్యేందుకు మోదీ కెనడా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సమ్మిట్ కు హాజరయ్యే క్రమంలో మోదీ సైప్రస్ దేశంలో ముందుగా టూర్ చేయనున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే సైప్రస్ అనేది టర్కీకి పొరుగు దేశం. ఈ దేశంలో ఉత్తర భూభాగాన్ని టర్కీ ఆక్రమించుకోవడంతో రెండు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే, భగ్గు మంటోంది. టర్కీ శత్రువుగా భావించే దేశంలో పర్యటించి, శత్రువుకు శత్రువు తమకు మిత్రుడనే మెసేజ్ ను పంపాలని మోదీ భావిస్తున్నారు.