PM Modi: పహల్గాం ఉగ్రదాడి ఘటన.. పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం

PM Modi: పహల్గామ్ దాడి తర్వాత సౌదీ నుండి తిరిగి వస్తున్న ప్రధాని మోడీ, పాక్ వైమానిక ప్రాంతాన్ని టచ్ చేయకుండా ఇండియా చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పర్యాటకులు, పౌరులు సహా 26 మంది మరణించిన తర్వాత, మంగళవారం సాయంత్రం సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానం, ఎయిర్ ఇండియా వన్ – పాకిస్తాన్ గగనతలాన్ని దాటలేదు.
మంగళవారం ఉదయం రియాద్కు వెళ్లే సమయంలో ప్రధాని భారత వైమానిక దళ బోయింగ్ 777-300 విమానం పాక్ గగనతలాన్ని దాటుతూ సౌదీ వెళ్లింది. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మలుపులు తీసుకొని వచ్చినట్టు విమాన ట్రాకింగ్ వెబ్సైట్ దృశ్యాలు నిర్ధారించాయి. తిరిగి వచ్చేటప్పుడు అరేబియా సముద్రం మీదుగా నేరుగా ప్రయాణించి గుజరాత్ మీదుగా ప్రవేశించి ఉత్తరం వైపు తిరిగి ఢిల్లీకి మోడీ విమానం చేరింది.
ఈ సమయంలో పాకిస్తాన్ గగనతలాన్ని మోడీ విమానం వాడుకోకపోవడం విశేషం. ఈ సమయంలో భారత ప్రధాన మంత్రి, విమానంలో ఉన్న ప్రతినిధి బృందం భద్రత దృష్ట్యా, స్వదేశానికి తిరిగి వచ్చే మార్గంలో విమాన మార్గాన్ని మార్చుకోవడం తెలివైన చర్యని రూటింగ్ మార్పు స్పష్టం చేస్తోంది. ప్రధాని మోడీ ఢిల్లీలోని పాలం వైమానిక దళ స్థావరంలో తెల్లవారుజామున దిగారు.