తెలంగాణ
MLC Kavitha: భారత్లో ఉన్నవారంతా కార్మికులే

MLC Kavitha: భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కార్మికులే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జర్నలిస్టులు, కవులు కూడా కార్మికులే అన్నారు. ప్రభుత్వాలు సులభంగా కార్మికుల శ్రమని దోచుకునేలా చట్టాలు చేశారని గుర్తుచేశారు. మే 20 న జరిగే సమ్మెలో జాగృతి తరఫున కార్మికులందరూ పాల్గొనాలని కవిత అన్నారు.
రేపటి తెలంగాణలో భూమి ఉన్నా, లేకున్నా కార్మికుడిగా ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ మరొక తెలంగాణ ఉద్యమంలా పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు. సాధించు కోవాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలి కానీ వదిలిపెట్టొద్దన్నారు.