తెలంగాణ
MLC Kavitha: తెలంగాణ భవన్కు తాళం వేయడం దుర్మార్గం

MLC Kavitha: కష్టకాలంలో కలసికట్టుగా సమస్యను ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని ఆమె అన్నారు. ఇప్పుడు కేటీఆర్ను ఏసీబీ విచారిస్తుంది. మేం ఇలాంటి వేధింపులకు భయపడేవాళ్లం కాదు అని ఘాటుగా స్పందించారు.
కేటీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్కు తాళం వేయడం దుర్మార్గమన్నారు. కార్యకర్తలను, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం అని నిప్పులు చెరిగారు. ఇక తమపై ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు.