తెలంగాణ
MLC Kavitha: రాహుల్, రేవంత్ మాటలకే పరిమితం అయ్యారు

MLC Kavitha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్రానికి కనిపించడం లేదా అని కవిత ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చిన రాహుల్, రేవంత్ మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు.
క్వింటాల్ పసుపు ధర 15వేలు కల్పిస్తామని కనీసం 9వేలు కూడా ఇవ్వడం లేదన్నారు. పసుపు బోర్డు తెచ్చామన్న ధర్మపురి అరవింద్ రైతులను పరామర్శించడంలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.