తెలంగాణ
MLC Kavitha: గ్యారెంటీలు ఎగ్గొట్టి కమీషన్లు తీసుకుంటున్నారు

MLC Kavitha: రేవంత్ సర్కార్ టార్గెట్గా MLC కవిత హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్ఛేంజ్లో కుదవ పెడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. కంచె గచ్చిబౌలి భూముల పేరుతో 10వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి, డబ్బులు పప్పు-బెల్లంలా పంచుకున్నారని విమర్శించారు.
భూముల అమ్మకం కోసం జీవో నెంబర్ 12 తీసుకొచ్చారని మండిపడ్డారు. 16 నెలల్లో లక్షా 80వేల కోట్లు అప్పు చేసినట్లు చెప్పారు కవిత. రేవంత్ది 20శాతం కమీషన్ ప్రభుత్వమంటూ మండిపడ్డారు. తెచ్చిన అప్పులతో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేదన్నారు కవిత.