తెలంగాణ
MLC Kavitha: గందరగోళం, కాకిలెక్కలతో రేవంత్ కాలం వెళ్లదీస్తున్నారు

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు చేశారు. సాగుకు నీళ్లివ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయన్నారు కవిత. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందన్నారు. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలన్నారు. మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండబెడుతున్నారని అన్నారు.
కేసీఆర్ హయాంలో కోదాడ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా లక్షా 22 వేల ఎకరాలకు నీళ్లు అందించారని.. ఇప్పుడెందుకు తేవడం లేదని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ని కవిత ప్రశ్నించారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఏ వర్గానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. సీఎం రేవంత్ గందరగోళం కాకిలెక్కలతో కాలం వెల్లదీస్తున్నారని కవిత అన్నారు.