తెలంగాణ
MLC Kavitha: రేవంత్రెడ్డి పాలనలో క్రైమ్ రేటు 20 శాతం పెరిగింది

MLC Kavitha: కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రేవంత్రెడ్డి ఏడాది పాలనలో క్రైమ్ రేటు 20 శాతం పెరిగిందని మండిపడ్డారు. మహిళలు బయటకు వెళ్లాలంటేనే బయపడే పరిస్థితి నెలకొందన్నారు. మహిళలకు స్కూటీలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో మహిళలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
రాహుల్ గాంధీ వరంగల్ వచ్చేందుకు భయపడ్డారని ఎద్దేవా చేశారు. ముందుకు మార్చి 8న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహిళ జాగృతి ధర్నా కార్యక్రమం పోస్టర్ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.