తెలంగాణ
మహబూబ్ నగర్ లో చిరుత కలకలం

మహబూబ్నగర్ జిల్లాలో పులి కనిపించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. 15 రోజుల నుంచి జనావాసాలకు సమీపంలో చిరుత సంచరిస్తుంది. వీరన్నపేట పరిసరాల్లో ఉన్న కొండ ప్రాంతంలో చిరుతపులి స్తిరపడింది. అప్పటినుంచి ఆ కొండను విడిచివెళ్లడంలేదు.
చిరుతను పట్టుకునేందుకు అధికారులు బోన్, కెమెరాలు అమర్చారు. అయినా అధికారుల కంటికి చిరుత చిక్కడంలేదు. ఇప్పుడు మరోసారి జనావాసాల సమీపంలోకి వచ్చింది. దాదాపు గంటసేపు కొండపైనే చిరుత సేదతీరింది.