తెలంగాణ
MLC Kavitha: ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించడమే నేరమా ?

MLC Kavitha: ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించడమే నేరమా ?
ప్రజా పాలనా… పోలీసుల పాలనా ?
కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఏమైందని అడిగినందుకు భీంగల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై మంత్రి జూపల్లి కృష్ణా రావు పోలీసులను ఉసిగొలిపి లాఠీచార్జి చేయించి తన కర్కశత్వాన్ని ప్రదర్శించారు.
లాఠీచార్జీలకు, కాంగ్రెస్ కార్యకర్తల దాడులకు భయపడేదే లేదు.
హామీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటాం.. కాంగ్రెస్ నాయకులను నిలదీస్తూనే ఉంటాం. లాఠీలను చూపించి భయపెట్టడం కాదు….చేతనైతే హామీలను అమలు చేసి చూపించండి.
లాఠీచార్జికు పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను.