తెలంగాణ
MLC Kavitha: బీసీలపై కాంగ్రెస్వి కాకి లెక్కలు

MLC Kavitha: బీసీలపై కాంగ్రెస్వి కాకి లెక్కలని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లో తేడాలు ఉన్నాయన్నారు. బీసీ గణన సరిగా జరగలేదనే మాట ప్రతీచోటా వినిపిస్తోందన్నారు. తెలంగాణలో బీసీల జనాభా కేవలం 46.2 మాత్రమే ఉందా అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ చెప్పినట్లు వెంటనే మైనార్టీలతో కలుపుకుని 56.3 శాతం బీసీలకు వెంటనే రిజర్వేషన్లు పెట్టి.. చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. బీసీలకు 56.3 శాతం రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు.