సినిమా
బెట్టింగ్ యాప్ కేసులో టాప్ సెలబ్రెటీలు.. రానా, మంచు లక్ష్మీ, విజయ్ దేవరకొండ పై కేసు

Betting app case: బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేసిన టాప్ సెలబ్రిటీలపై కేసు నమోదైంది. పలువురు సినీ ప్రముఖులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రానా దగ్గుబాటి, ప్రకాష్రాజ్, విజయ దేవరకొండతోపాటు హీరోయిన్లు మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, అలాగే యాంకర్లు శ్రీముఖి, సిరి హనుమంతు, శోభాశెట్టి సహా మొత్తం 25 మంది ప్రముఖలపై కేసులు నమోదయ్యాయి. వీరంతా బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించారని కేసు నమోదు చేశారు పోలీ సులు. సెక్షన్ 318(4) 112 రెడ్విత్, BNS 3, 3(A), 4,.. ఐటీ యాక్ట్ 66D కింద కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు.