ఆంధ్ర ప్రదేశ్
Thummala: చేనేత భవన్లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ.. టైమ్కు రాని ఉద్యోగులపై సీరియస్

Thummala: నాంపల్లి చేనేత భవన్లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం పదిన్నర గంటలకు కూడా కొందరు ఉద్యోగులు హాజరుకాకపోవడం మంత్రి దృష్టికి వచ్చింది. సమయ పాలన పాటించని ఉద్యోగుల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు కరెక్ట్ టైమ్కు రావాలని మంత్రి స్పష్టం చేశారు.



