తెలంగాణ

పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథనిలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన డ్రీమ్, స్టార్ట్ అండ్ రైజ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌లో భాగంగా గ్రామీణ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 2 కోట్ల 90 లక్షల కోట్లతో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతి పత్రాలను PACS చైర్మన్ పాలకవర్గానికి అందించారు.

కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన కుసుమ్ పథకం ద్వారా దేశంలోనే మొదటిసారి సహకార సంఘం నుంచి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మంథనిలో ఒక మెగా వాట్ పవర్ ప్రాజెక్ట్ ,ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయన్నారు.

సోలార్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతీ సంవత్సరం సహకార సంఘానికి 50 లక్షల ఆదాయం సమకోరుతుందన్నారు. సహకార సంఘాల ద్వారా అనేక రకాల వ్యాపారాలు చేయవచ్చని, సహకార సంఘం ద్వారా అనేక రకాల వ్యాపారాలు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button