ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి నగరపాలకసంస్థ డంపింగ్ యార్డు పరిశీలించిన మంత్రి నారాయణ

తిరుపతి నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త వదిలి వెళ్లింది. 2014 నుంచి 19 కాలంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామన్నారు. వైసీపీ రాగానే యంత్రాలను మూలన పడేసిందని మంత్రి మండిపడ్డారు.
కూటమి అధికారంలోకి వచ్చాక 85 లక్షల టన్నుల చెత్తను తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించాలని నిర్దేశించారన్నారు. ఇప్పటివరకు 50 లక్షల టన్నుల చెత్త తొలగించారన్నారు. లక్ష్యాన్ని పూర్తిచేయని నగరపాలక సంస్థలకు వెళ్లి నేరుగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.