తెలంగాణ
గ్లోబల్ సమ్మిట్కు అసోం సీఎం హిమంతను ఆహ్వానించిన మంత్రి జూపల్లి

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్-2047’ గ్లోబల్ సమ్మిట్కు రావాలని అసోం సీఎం హిమంత బిస్వా శర్మను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సమ్మిట్కు హాజరు కావాలని కోరారు. సమ్మిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి సీఎంకు వివరించారు.



