తెలంగాణ
Jupally: బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం

Jupally: బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు మంత్రి జూపల్లి. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఫైర్ అయ్యారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు మోదీని నిలదీయాలన్నారు.
సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కేంద్ర బడ్జెట్పై నాగర్ కర్నూలులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి లక్షా 60 వేల కోట్లు వెళ్తుందని.. అయినా రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించారని మండిపడ్డారు మంత్రి జూపల్లి.