తెలంగాణ

Hyderabad Metro: నేటి నుంచి మెట్రో రైలు ఛార్జీల పెంపు అమలు

Hyderabad Metro: హైద‌రాబాద్ మెట్రో ఛార్జీలు పెరిగాయి. పెరిగిన మెట్రో రైలు ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. క‌నీస ఛార్జీ 10 నుంచి 12 రూపాయలకు.. గ‌రిష్ఠ టికెట్ ధ‌ర 60 నుంచి 75 రూపాయలకు పెంచారు. ఇలా కనిష్ఠంగా 2రూపాయలు, గరిష్ఠంగా 16 రూపాయల వరకు ఛార్జీలు పెంచామని ఎల్‌‌అండ్‌‌టీ ప్రకటించింది.

పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు టాక్ వినబడుతోంది. క‌రోనా మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది.

దీంతో ఛార్జీలు పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button