Chiranjeevi- NTR: తీవ్రంగా కలచివేసింది.. చిరంజీవి, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

Chiranjeevi: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండుగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి.. సైఫ్ను కత్తితో పొడిచాడు. దీంతో ఆయకు ఆరోచోట్ల గాయాలయ్యాయి. ప్రస్తుతం లీలావతి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. దీనిపై సినీ నటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడిపై టాలీవుడ్ హీరో , మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. సైఫ్ అలీఖాన్పై దాడి తనను ఎంతగానో కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
మరోవైపు.. సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడిపై జూనియర ఎన్టీఆర్ కూడా స్పందించారు. బాలీవుడ్ హీరో సైఫ్ పై దాడి గురించి తెలిసి షాకయ్యా.. ఇది నిజంగా చాలా బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మరోవైపు హీరో సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సిని ప్రేమికులు, అభిమానులు పోస్టులు పెడుతున్నారు.