Meerpet Murder Case: హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో రోజుకో కొత్తకోణం

Meerpet Murder Case: హైదరాబాద్ మీర్పేట్ గృహిణి హత్య కేసులో రోజుకో కొత్తకోణం వెలుగు చూస్తోంది. గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్యచేసి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, పోలీసులు విచారణలో మాధవిని తానే హత్యచేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇంట్లోనే తన భార్యను హత్యచేశానని, అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుముక్కలు చేసి, ఎముకలను కాల్చి పొడిచేసి బయటపడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణ లో చెప్పారు.
పోలీసులు గురుమూర్తి నివాసం ఉంటున్న ఇంట్లో అణువణువు తనిఖీలు చేశారు.. అయితే, ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల మరోసారి గురుమూర్తి నివాసంలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి దర్యాప్తు బృందం తనిఖీ చేసి ఎట్టకేలకు ఆధారాలను సేకరించారు. ఆ ఆధారాలను డీఎన్ఏ రిపోర్టుకు పంపించారు. తాజాగా ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది.
గురుమూర్తి తన భార్యను మళయాళం సినిమా స్ఫూర్తితో హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. మళయాళం సినిమాను గురుమూర్తి చాలాసార్లు చూసినట్లు, ఆ సినిమా ఆధారంగా భార్య హత్యకు కుట్ర చేసినట్లు తెలుస్తుంది. మాధవిని హత్యచేసిన తరువాత యాసిడ్, రసాయనాలతో ఆమె శరీర భాగాలను కాల్చి ముద్దగా మార్చేశాడు. ఆ తరువాత దుర్వాసన రాకుండా స్ప్రే కెమికల్స్ వాడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నిందితుడి చేతికి కాలిన గాయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును హత్యకేసుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసు ను హత్యకేసుగా పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది. డీఏఎన్ఏ రిపోర్టు రాగానే గురుమూర్తిపై హత్యకేసును నమోదు చేయనున్నారు పోలీసులు.