తెలంగాణ
టీ.కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస భేటీలు

Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రెండోరోజు కూడా ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులతో భేటీ కానున్నారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ సమావేశం కొనసాగనున్నట్లు సమాచారం.
ఇవాళ చేవెళ్ల, మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలపై ఫోకస్ చేయనున్నారు ఆమె. అదేవిధంగా కాంగ్రెస్ పాలనపై ప్రజల స్పందనను ఆరా తీయనున్నారు మీనాక్షి నటరాజన్. అండ్ స్థానిక ఎన్నికల్లో పార్టీల బలాబలాల గురించి ఎంక్వైరీ చేయనున్నారు. కాగా.. వచ్చేనెల ఐదో తేదీ వరకు హైదరాబాద్లో ఉండనున్నారు మీనాక్షి నటరాజన్.