తెలంగాణ
Hyderabad: రౌడీషీటర్ మసీయుద్దీన్ను చంపేసిన దుండగులు

Hyderabad: రౌడీషీటర్ మసీయుద్దీన్ను దుండగులు చంపేశారు. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్యచేశారు. హైదరాబాద్ పాతబస్తీలో వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న రెయిన్బజార్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు పాత కక్షలే కారణమంటున్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రికి మసీయుద్దీన్ మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.