తెలంగాణ
కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ

భద్రాద్రి కొత్తగూడెం- అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నల్లపు దుర్గా ప్రసాద్కు మరణశిక్ష తప్పదని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.
మావోయిస్టుల హత్యలకు కారణమైన టీపీసీసీ నల్లపు దర్గాప్రసాద్ను వదలబోమని నమ్మించి మోసం చేసి మావోయిస్టుల హత్యలకు కారణమయ్యారన్నారు. ఆయన చేసిన ద్రోహమే మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతికి కారణమన్నారు. ఇందుకు సంబంధించి ఆడియో రికార్డ్స్ ఉన్నాయని శిక్ష తప్పదని హెచ్చరించారు.



