జాతియం
Chhattisgarh: మావోయిస్టుల కుట్ర భగ్నం.. ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

Chhattisgarh: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీ బాంబులు అమర్చారు మావోయిస్టులు. మెయిన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్మెండ్ అడవుల్లో బాంబులను అమర్చగా భద్రతా బలగాలు వాటిని గుర్తించి నిర్వీర్యం చేశారు.