Prakasam: ప్రపంచ శాంతి కోసం ఓ వ్యక్తి సజీవ సమాధికి ప్రయత్నం

Prakasam: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం లో ఓ వ్యక్తి జీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించాడు. అయిదు అడుగుల మేర గుంట తీసుకుని, ఒంటిపై బట్టలు లేకుండా గుంటలోనికి ప్రవేశించాడు. అనంతరం ఆ గుంటపైన ఇనుప రేకు పెట్టి మట్టితో పూడ్చివేయమని చెప్పగా గ్రామస్తులు ఆ గుంటను పూడ్చారు. షుమారు 5 గంటల పాటు ఆ వ్యక్తి గుంట లోనే ఉన్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని అతని దీక్షను భగ్నం చేశారు. జీవసమాధి నుండి అతడిని బయటకు తీసి, గుంటను పూడ్చారు.
తాళ్లూరు మండలం విఠలాపురానికి చెందిన కైపు కోటిరెడ్డికి గత కొన్ని సంవత్సరాలుగా భూదేవి అమ్మవారు ఒంట్లోకి వస్తుందని, అమ్మవారిపై భక్తితో 30 అడుగుల లోతులో 30 లక్షల రూపాయలతో ఓ గుడిని కూడా నిర్మించాడు. భూదేవి అమ్మవారి విగ్రహానికి నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు. ఉగాది రోజు అతను జీవాసమాది అవుతున్నడంటూ గ్రామస్తులకు తెలియడంతో చూసేందుకు గ్రామస్తులు భారీగా చేరుకున్నారు.
కోటిరెడ్డి గుంటలో కూర్చుని దీక్ష చేపట్టాడు. అయితే కొన్ని గంటల్లోనే పోలీసులు వచ్చి జీవసమాది నుండి బయటకి తీశారు. ప్రపంచంలోనే భూదేవి అమ్మవారి ఆలయం ఎక్కడా లేదని, మొట్టమొదటి సారిగా ఏపీలో తానే నిర్మించానని చెప్తున్నాడు. తన పేరే భూదేవి పుత్రుడినని, ప్రపంచ శాంతి కొసమే, ఈ దీక్ష చేపట్టినట్లు చెప్పుకొచ్చాడు.