ఆంధ్ర ప్రదేశ్
Kuppam: అప్పు తీర్చలేదని.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. కనీసం మహిళ అనే కనికరం కూడా చూపలేదు . నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద తిమ్మరాయప్ప 80వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చలేక భార్య, పిల్లల్ని వదిలి వెళ్లిపోయాడు తిమ్మ రాయప్ప. దీంతో కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది మహిళ శిరీష.
ఈ క్రమంలోనే మూడేళ్లు అయినా అప్పు తీర్చలేదని మునికన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్య పదజాలంతో మహిళను తిడుతూ రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేశాడు. అంతేకాదు ఇచ్చిన అప్పు చెల్లించకపోతే ఇక్కడే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసు కున్న పోలీసులు మునికన్నప్పతోపాటు ఆయన కుటుంబంపై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు.