తెలంగాణ
Nalgonda: వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

Nalgonda: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శెట్టిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి ఇతర ప్రాంతాల నుంచి నెమలి, దుప్పి మాంసం తీసుకువచ్చి కేజీలుగా ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో విక్రయ కేంద్రంపై పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఎన్ని రోజుల నుంచి నెమలి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఎంత మంది ఇందులో ప్రమేయం ఉందని పోలీసులు విచారిస్తున్నారు.