ఆంధ్ర ప్రదేశ్
అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో అకాల వర్షం మొక్కజొన్న నడ్డి విరిచింది. పలుచోట్ల మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. జి. కొండూరు మండల వ్యాప్తంగా 369 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేయగా.. 115 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నదని వ్యవసాయ అధికారి రామ్ కుమార్ తెలిపారు.
మొత్తం 7 గ్రామాల్లో 52 మంది రైతులపై ప్రభావం పడిందన్నారు. మరికొద్ది రోజులలో కోతకు వస్తుందనగా పెనుగాలుల తీవ్రతకు మొక్కజొన్న పంట నేలకొరిగిందన్నారు. అయితే తమకు జరిగిన నష్టంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు అధికారులను కోరారు.