తెలంగాణ
Mahesh Kumar Goud: బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ప్లాప్ అయింది

Mahesh Goud: కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఫైరయ్యారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ప్లాప్ అయిందని మహేష్కుమార్ గౌడ్ విమర్శించారు. కేసీఆర్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నిన్నటి సభలో కేసీఆర్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నామని అన్నారు. ఆ సభలో జనాలకంటే ఎక్కువ విస్కీ బాటిల్స్ ఉన్నాయని ఎద్దేవా చేశారు.
సభలో మహిళలు కనిపించలేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్ చర్చకు సిద్ధమా అని మహేష్కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా కేసీఆర్ అబద్ధాలతో మభ్యపెట్టడానికి చూస్తున్నారని మహేష్కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. అతి తక్కువ సమయంలో ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం కేసీఆర్దని ఆరోపించారు.