తెలంగాణ
చేతనైతే సాయం చెయ్ కానీ విమర్శలొద్దు.. కిషన్ రెడ్డికి మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

Mahesh Kumar: కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కిషన్రెడ్డిని కోరితే బాధ్యతా రాహిత్యంగా తప్పించుకునేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
మీ పనులు మీరు సక్రమంగా చేస్తే గౌరవిస్తామన్నారు. చేతనైతే సహాయం చేయాలి కానీ విమర్శలు వద్దన్న ఆయన రాష్ట్ర ప్రజలకు సీఎం ఎవరో తెలుసన్నారు.