ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొలహాలంగా కొనసాగుతున్నాయి. ఆరవరోజు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామి పుష్పపల్లకిసేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశేషాభక్త జానవాహిని మధ్య ఆలయ ప్రదక్షిణలు గావించారు. రాజగోపురం గుండా పుష్పపల్లకిసేవలో స్వామి అమ్మవార్లను ఉరేగించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.