టాలీవుడ్

Madhavi Latha: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు

Madhavi Latha: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిల్మ్ ఛాంబర్‌లో మాధవీలత ఫిర్యాదు చేశారు. హెచ్‌ఆర్సీ, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై దారుణంగా మాట్లాడారని, జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదన్నారు. అందుకే మూవీఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘మా’ ట్రెజరర్ శివబాలాజీకి కాల్‌ చేస్తే స్పందించారని, తన ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్లారన్నారు.

సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని, వ్యక్తిత్వ హననడం చేయడం దారుణమన్నారు. రాజకీయ నాయకలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడం సరికాదన్నారు శివబాలాజీ. రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావొద్దని, మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి.. నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button