తెలంగాణ
Madhavaram Krishna Rao: ప్రభుత్వం మహిళలకు ఇచ్చి హామీలను మరచింది

Madhavaram Krishna Rao: రాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం కల్పించి గత ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా కార్పొరేటర్లతొ కలిసి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రావలసిన హక్కులను కాపాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో మహిళలకు స్కూటీలను తులం బంగారంతో పాటుగా రెండువేల ఐదువందల రూపాయల పెన్షన్లు ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారి హక్కులను కాపాడాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.