తెలంగాణ
మహిళ చూపుడు వేలు కొరికేసిన చీటీ నిర్వాహకుడు

హైదరాబాద్ మధురానగర్లో దారుణం చోటు చేసుకుంది. చీటీ నిర్వాహకుడు మహిళ చూపుడు వేలు కొరికేసాడు. మహిళ వేలు ఊడి కిందపడింది. బాధితురాలు వేలు పట్టుకుని ఆస్పత్రికి వెళ్లగా అతికించలేమని వైద్యులు చెప్పారు. బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుడు హేమంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు.