తెలంగాణ
Ibrahimpatnam: చికెన్ బిర్యానీలో బల్లి

Ibrahimpatnam: బిర్యానిలో బల్లి ప్రత్యక్షమైన సంఘటన మెహిఫిల్ రెస్టారెంట్లో వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రహదారిపై ఉన్న మెహిఫిల్ రెస్టారెంట్లో ఈ సంఘటన బయటపడింది. తొలుత కస్టమర్ చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాడు. అయితే బిర్యాని తింటుండగా ఆయనకు బిర్యానిలో బల్లి కనిపించింది. దీంతో కస్టమర్ కృష్ణారెడ్డి ఒక్కసారి షాక్ కు గురయ్యాడు.
రెస్టారెంట్ యజమానిని నిలదీయగా ఆయన మాత్రం బల్లి మంచిగా ఫ్రై అయింది, తినొచ్చుగా అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు. దీంతో కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మెహిఫిల్ రెస్టారెంట్ను మూసివేసి మేనేజర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.