క్రీడలు

Lionel Messi: ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’.. 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ

Lionel Messi: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి గోట్ టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. శనివారం ఉదయం కోల్‌కతాలోని లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌తో కలిసి మెస్సి వర్చువల్‌గా ఆవిష్కరించారు. భద్రతా కారణాల వల్ల మెస్సి స్వయంగా అక్కడికి వెళ్లలేకపోయారు. అనంతరం సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలను మెస్సి కలవనున్నారు.

ఆ తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. తెల్లవారుజామున కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్న మెస్సితో పాటు ఇంటర్ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ కూడా ఉన్నారు. 14 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన మెస్సిని చూసేందుకు వందలాది మంది అభిమానులు విమానాశ్రయానికి చేరుకొని, అర్జెంటీనా జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button