ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో మరోసారి చిరుత కలకలం

తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. మంగళం రోడ్డులో చిరుత కదలికలను అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చిరుత సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న ఎస్వీయూ సమీపంలో బోనులో ఓ చిరుత చిక్కింది. చిరుత చిక్కిన మరికొన్ని గంటల్లో మరో చిరుత కంటపడ్డింది. ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరించారు.



