జాతియం
నేటితో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలు

నేటితో పార్లమెంటు తొలి విడత సమావేశాలు ముగియనున్నాయి. నేడు చివరి రోజు పార్లమెంటు ముందుకు ఇన్కం ట్యాక్స్ బిల్లు రానుంది. 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 622 పేజీలతో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 1961 నుంచి ఉన్నపాత చట్టానికి స్వస్తి పలకనున్నారు. ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కం ట్యాక్స్ చట్టం అమలు కానుంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉంది. దీంతో ట్యాక్స్ విధానం సులభతరం కానుంది. అదేవిధంగా డిజిటల్ ట్యాక్స్ విధానం అమలుకానుంది.