తెలంగాణ

KTR: మంద పార్ధీవ దేహంకు మాజీ మంత్రి కేటీఆర్ నివాళులు

KTR: హైదరాబాద్ .. చంపాపేట్ లోని నివాసంకు మంద జగన్నాధం పార్ధీవ దేహం చేరుకుంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో జగన్నాధం నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. నిమ్స్ నుండి ఆయన నివాసానికి పార్ధీవ దేహాన్ని చేర్చారు. మంద జగన్నాధం మృతదేహానికి మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. కేటీఆర్ తో పాటు పలువురు పార్టీ నేతలు నివాళులర్పించారు.

ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు కేటీఆర్. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని.. మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందన్నారు. పాలమూరు జిల్లా రాజకీయాల్లో మంద జగన్నాధం తనదైన ముద్ర వేశారుని వెల్లడించారు కేటీఆర్. జగన్నాథంను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు కేటీఆర్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button