తెలంగాణ

KTR: జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా కేటీఆర్‌కు గాయం

KTR: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయాలు తెర లేస్తున్నాయా ఇక తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆరే అని ఏపీ నేతలు అనుకుంటున్నారా ఏపీ సీఎం రేసులో ఉన్నవారితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారా జిమ్‌లో గాయాలపాలైన కేటీఆర్‌ను పరామర్శించడం వెనుక రాజకీయ కోణాలు దాగున్నాయా కేటీఆర్ రిప్లయ్‌ల వెనుక పరమార్థం ఏమిటి..! లెట్స్ వాచ్ దిస్ స్టోరీ…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు గాయమైంది. జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా కేటీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన వెన్నుపూసకు గాయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆరే తెలిపారు. తాను జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డానని కొన్ని రోజులు ప్రజలకు దూరంగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు.

కేటీఆర్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ప్రకటన చేయడంతో అన్ని పార్టీల రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు.. కేటీఆర్‌ను సోషల్ మీడియా వేదికగా పరామర్శించారు. ఎవరైనా రాజకీయ నేతలు గాయాలపాలైనప్పుడు, అస్వస్థతకు లోనైనప్పుడు పరామర్శించడం కామనే. అయితే పరామర్శలో కూడా ఇప్పుడు ఏవైనా రాజకీయ కోణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట.

జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా గాయపడిన కేటీఆర్‌ను పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పరామర్శిస్తున్నారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. బ్రదర్‌ కేటీఆర్‌ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. జగన్ ట్వీట్‌కు థాంక్యూ అన్న అంటూ కేటీఆర్ రిప్లయ్ ఇచ్చారు.

కేటీఆర్‌కు గాయాలు కావడంపై కూటమి నేతలు కూడా స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పరామర్శిస్తూ సోదరుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. వైద్యుల సూచనలకు అనుగుణంగా తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పవన్ కల్యాణ్ ట్వీట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ రిప్లయ్ ఇచ్చారు కేటీఆర్. ఇక కేటీఆర్‌కు గాయమైన సంగతి తెలిసి బాధపడ్డానని ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక కేటీఆర్ త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యం, బలాన్ని పొందాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. బండి సంజయ్ పోస్టుపై స్పందించిన కేటీఆర్ థాంక్యూ బండి సంజయ్ గారు అంటూ రిప్లయ్ ఇచ్చారు.

ఎవరైనా రాజకీయ నాయకులు అనారోగ్యం పాలైనప్పుడు, గాయాల పాలైనప్పుడు పార్టీలకతీతంగా నేతలు పరామర్శించడం సాధారణమే. కానీ ఇప్పుడు కేటీఆర్‌ను ఏపీ నేతలు పోటీపడి మరీ పరామర్శించడం అందుకు కేటీఆర్ ఆసక్తికరంగా రిప్లయ్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. కేటీఆర్‌ను బ్రదర్ అని సంబోధిస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేయడం ఆసక్తి రేపుతోంది. కేటీఆర్ కూడా జగన్‌ను అన్న అని సంబోధిస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ కూడా కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దానికి కేటీఆర్ కూడా రిప్లయ్ ఇచ్చారు. అయితే ఇప్పుడిదే టాపిక్ పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారి తీస్తోంది. తెంగాణకు కాబోయే సీఎం కేటీఆరేనని ఏపీ నేతలు ఫిక్సయ్యారా అనే టాక్ నడుస్తోందట. అందుకే ఏపీ నేతలు పోటీపడి మరి కేటీఆర్‌ను పరామర్శిస్తున్నారా అనే చర్చ జరగుతోందట.

అంతేకాదు కేటీఆర్‌ను పరామర్శించిన జగన్ మాజీ సీఎం ఇక పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఏపీ సీఎం రేసులో ఉన్నారు. వీరంతా తెలంగాణకు కాబోయే సీఎంను పరామర్శించారా అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోందట. అంతేకాదు జగన్, పవన్, లోకేష్ ముగ్గురిలో ఎవరో ఒకరు భవిష్యత్తులో ఏపీకి సీఎం అవుతారు కాబట్టి వారితో కేటీఆర్ మంచి రిలేషన్ నడిపిస్తున్నారట. అందుకే వారిని అన్న అని సంభోదిస్తున్నారనే టాక్ నడుస్తోందట.

ఇక కేటీఆర్ కోలుకోవాలని బండి సంజయ్ పోస్టుపై కేటీఆర్ ముక్తసరిగా స్పందించారనే టాక్ నడుస్తోందట. కేటీఆర్ త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యం, బలాన్ని పొందాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని బండి సంజయ్ ట్వీట్ చేస్తే కేటీఆర్ మాత్రం థాంక్యూ సంజయ్ గారు అని రిప్లయ్ ఇచ్చారు. మొత్తానికి ఏపీ నేతలు ముద్దు తెలంగాణ నేతలతో హద్దు అనే రీతిలో కేటీఆర్ వ్యవహార శైలి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button