తెలంగాణ
ఏసీబీ విచారణకు కేటీఆర్.. జగిత్యాలకు కవిత

ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ భారీగా తరలివచ్చారు. అయితే సొంత చెల్లి, ఎమ్మెల్సీ కవిత మాత్రం జగిత్యాల పర్యటనకు వెళ్లింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ వెళ్లిన రోజు కవిత మద్ధతుగా ఫాంహౌస్ కు వెళ్లింది.
దీంతో కేటీఆర్, కవిత మధ్య దూరం మరింత పెరిగిందంటూ పార్టీ నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. కేటీఆర్ విచారణ నేపథ్యంలో హరీష్ రావు ఉదయం నుంచి తెలంగాణ భవన్లోనే ఇతర నేతలతో మానిటరింగ్ చేస్తున్నారు.