KTR: ప్రజాపాలన అంటే నోట్లవేట- ఓట్ల వేట మాత్రమేనా?

KTR: SLBC టన్నెల్ దుర్ఘటనపై సీఎంకు సీరియస్నెస్ లేదని మండి పడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ . ట్విట్టర్ వేదికగా కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. టన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ తెలియని పరిస్థితుల్లో .సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం దిగజారుడు రాజకీయం అన్నారు.
ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు సీఎం సమయం ఉంది కానీ క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లే టైమ్ లేదా అంటూ ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా ? ప్రజాపాలన అంటే నోట్ల వేట ఓట్ల వేట మాత్రమేనా ? అంటూ ఫైర్ అయ్యారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యూయేట్స్ కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెడ్తారని ట్వీట్ చేశారు.