తెలంగాణ
KTR: రుణమాఫీని ఆగం చేసి.. పెట్టుబడి సాయానికి పాతరేశారు

KTR: రేవంత్ పాలనపై మాజీమంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా హామీల అమలుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చి.. రైతుల ఆత్మహత్యలు ఆపాలని పేర్కొన్నారు.
అబద్ధపు హామీలతో అధికార పీఠమెక్కి, రైతులను బలిపీఠం ఎక్కిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. 420 మంది రైతుల బలవన్మరణంతో.. తెలంగాణ భారీ మూ ల్యం చెల్లించుకుందన్నారు కేటీఆర్. మొత్తానికి రుణమాఫీని ఆగం చేసి.. పెట్టుబడి సాయానికి పాతరేశారంటూ ఫైర్ అయ్యారు.